ఎక్కువ సేపు అవే చూస్తే కళ్ళు దొబ్బుతాయంటున్న మాధవీలత...

తెలుగులో ప్రముఖ దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహించిన “నచ్చావులే” అనే చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ మాధవీలత గురించి తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే మంచి హిట్ టాక్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ తన తదుపరి చిత్రాల కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఈ అమ్మడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయ్యాయి.

 Madhavi Latha, Tollywood Actress, Face Book, Social Media Time, Tollywood-TeluguStop.com

దీంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు కరువయ్యాయి.ప్రస్తుతం ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అందుబాటులో ఉంటోంది.

తాజాగా మాధవీలత చరవాణి తో ఎక్కువ సమయం గడిపే వాళ్లను ఉద్దేశిస్తూ తన అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ ని షేర్ చేసింది.ఇందులో రోజులో ఎక్కువ సమయం పాటు సెల్ ఫోన్ లోని సోషల్ మీడియాలో గడపడం సరి కాదంటోంది ఈ అమ్మడు.

అంతేకాక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ప్రశాంతంగా జీవితం గడుపుతూ మన జీవితంలో చేసినటువంటి తప్పు ఒప్పొప్పుల గురించి ఒకసారి గుర్తు చేసుకుంటూ, చేసిన తప్పులను సరిదిద్దుకుని మార్గాలను గురించి ఆలోచిస్తే జీవితం ఎంతో బాగుంటుందని తెలిపింది.అంతేగాక ఎక్కువ సమయం సెల్ ఫోన్ తో గడపడం వల్ల కళ్ళు దెబ్బతింటాయని కాబట్టి వీలైనంత తక్కువ సమయం చరవాణికి కేటాయించాలని సూచిస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఈ అమ్మడు బీజేపీ పార్టీలో చేరి తన సేవలు అందిస్తోంది.కానీ రోజు ఏదో ఒక విషయంపై స్పందిస్తూ ఈ మధ్యకాలంలో మాధవీలత తరచూ వార్తల్లో నిలుస్తోంది.

గతంలో కుడా తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి మారిన “సాదినేని యామిని” గురించి పలు వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube