చిన్న మూవీలతో పెద్ద హిట్ లను కొట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో సర్వ సాధారణం అయిపొయింది.అలా ఇండస్ట్రీ లో మంచి హిట్ కొట్టిన హీరో గా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి చేరాడు.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న నవీన్ జాతి రత్నాలు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.అయితే దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడింది.
లాక్ డౌన్ సమయం పూర్తి కాగానే ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం ఇంకా రిలీజ్ కూడా రాకుండానే టాలీవుడ్ నట సింహం ,బోయపాటి కాంబినేషన్ లో వచ్చే చిత్రంలో బాలయ్య బాబు కు అసిస్టెంట్ గా నవీన్ నటించబోతున్నట్లు వార్తలు వెల్లడైన విషయం తెలిసిందే.
అయితే ఈ వార్తలపై తాజాగా నవీన్ స్పందిస్తూ ఇదంతా నిజం కాదని స్పష్టం చేశాడు.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు నన్ను ఎవరూ సంప్రదించలేదని, అసలు ఈ చిత్రంలో నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ నవీన్ స్పష్టం చేశాడు.
అవన్నీ వట్టి పుకార్లే అంటూ కొట్టిపారేశాడు.మరోపక్క బాలయ్య,బోయపాటి వంటి హిట్ కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతుంది అని తెలియడం తో అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడెప్పుడు ముగించుకొని విడుదల కు సిద్దమౌతుండగా అని బాలయ్య బాబు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.గత నెల రోజులుగా కొనసాగుతున్న లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల ఈ సినిమా కు సంబంధించి ఎలాంటి అప్డేట్ అనేది లేదు.
ఇంకా ఈ లాక్ డౌన్ ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.మరి ఈ లాక్ డౌన్ పూర్తి అయ్యేవరకు సినిమా ల షూటింగ్ లు కష్టమయ్యేలా ఉంది.
మరి లాక్ డౌన్ పూర్తి అయిన తరువాత ఎప్పుడు సినిమా షూటింగ్స్ ప్రారంభమౌతాయో అని అటు సినీ కళామతల్లి ముద్దు బిడ్డలు,ఇటు ప్రేక్షకులు అందరూ కూడా ఎదురుచూస్తున్నారు.