కరోనా వైరస్..
ప్రస్తుతం ప్రపంచంలో ఈ వైరస్ తీవ్రత ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజు రోజుకు పెరుగుతున్న ఈ వైరస్ నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయ్.
ఇంకా ఈ నేపథ్యంలోనే మన దేశంలో కూడా గత ముప్పై రోజులుగా లాక్ డౌన్ అమలవుతుంది.
దీంతో అందరూ కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు.
ఇంకా కుటుంబాలతో కలిసి ఎంతో ఆనందంగా ఉంటున్నారు.అయితే ఈ లాక్ డౌన్ కారణంగా మరో ఎఫెక్ట్ కూడా పడింది అని అంటున్నారు కొందరు నిపుణులు.
అసలు ఎం అయ్యింది అంటే? నిజానికి ప్రజలను ఎవరు బయటకు రాకుండా చేశారు.కానీ నిత్యావసర సరుకులు, కూరగాయలు కోసం మాత్రమే ప్రజలను బయటకు అనుమతిస్తున్నారు.
అంతేకాదు నిత్యావసర మందులకు కూడా అనుమతిస్తున్నారు.
ఇంకా ఈ నేపథ్యంలోనే మెడికల్ షాపుల ముందు క్యూ కడుతున్నారు.
ఎందుకో తెలుసా? కండోమ్స్, ఐపిల్ ట్యాబ్లెట్స్, ప్రెగ్నెన్సీ కిట్స్ కోసం.ముంబైలో, హైదరాబాద్ లో ఎక్కువ మంది ప్రజలు ఇందుకే బయటకు వస్తున్నారు అని ప్రముఖ డంజో యాప్ బయటపెట్టింది.
అంతేకాదు.సోషల్ మీడియాలో తాజాగా మరో విషయానికి కూడా బయటపెట్టింది.
అది ఏంటి అంటే? కేవలం అంటే కేవలం ఒక నెలలో ప్రెగ్నెన్సీలు 12 కోట్లు దాటాయి అని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రచారం మాత్రం భారీగా జరుగుతుంది.