టాలీవుడ్ ప్రముఖుడు దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం “పుష్ప” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తుండగా కన్నడ భామ అ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నాడు.ఇప్పటికే ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించి నటువంటి మాస్ లుక్ పోస్టర్లు విడుదల చేయగా మంచి స్పందన లభించింది.
అయితే ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ మధ్యకాలంలో ఈ విషయానికి సంబంధించినటువంటి పలు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటించడం కోసం దాదాపుగా పది కోట్ల రూపాయను పారితోషికం డిమాండ్ చేసినట్లు సమాచారం.దీంతో చిత్ర యూనిట్ సభ్యులు విజయ్ సేతుపతిని తీసుకోవాలా, వద్దా అనే సందిగ్ధంలో పడ్డారట.
కానీ ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్ర కీలకం కావడంతో అల్లు అర్జున్ ఖచ్చితంగా విజయ్ సేతుపతిని తీసుకోవాలని చిత్ర యూనిట్ సభ్యులకు సూచించాడట.
అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో విజయ్ సేతుపతి ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు కూడా పలు వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పటి వరకు ఈ వార్తలపై చిత్ర యూనిట్ సభ్యులు స్పందించలేదు.దీంతో పుష్ప చిత్రంలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడనే ఈ విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు.
కనీసం ఇప్పటికైనా చిత్ర యూనిట్ సభ్యులు స్పందించి విజయ్ సేతుపతి పాత్ర పై క్లారిటీ ఇస్తే బాగుంటుందని అల్లు అర్జున్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ విషయంపై పుష్ప చిత్ర యూనిట్ సభ్యులు స్పందిస్తారో లేదో చూడాలి.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి చిత్రీకరణ పనులు కేరళ రాష్ట్రంలో జరుగుతుండగా లాక్ డౌన్ కారణంగా కొంత కాలం పాటు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు చిత్ర యూనిట్ సభ్యులు నిలిపివేశారు.లాక్ డౌన్ ముగిసిన అనంతరం యధావిధిగా షూటింగ్ పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.