భారత్ వివిధ బ్యాంకుల్లో 9 వేల కోట్లమేరకు రుణాలు తీసుకొని మనీలాండరింగ్ ఆరోపణలు ఎదురుకొంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్ లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.అయితే మాల్యా ను విచారణ నిమిత్తం ఇండియాకు అప్పగించాలి అంటూ భారత ప్రభుత్వం లండన్ కోర్టు ను ఆశ్రయించగా హైకోర్టు భారత్ కు అనుకూలంగా తీర్పు కూడా ఇచ్చింది.
అయితే తనను భారత్ కు అప్పగించరాదని తాను తీసుకున్న రుణాలను చెల్లిస్తాను అంటూ విజయ్ మాల్యా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేయగా దానికి కొట్టివేసినట్లు తెలుస్తుంది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా భారత్ తో 9 వేల కోట్ల మేరకు బ్యాంకులకు టోకరా పెట్టి గుట్టు చప్పుడు కాకుండా 2016 లో లండన్ కు చెక్కేశాడు.
అయితే అతడిని భారత్ కు తిరిగి తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.ఈ క్రమంలో 2017 లో లండన్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం తో మళ్లీ బెయిల్ పై బయటకు వచ్చిన మాల్యా సాధారణ వ్యక్తిలానే తిరుగుతూ ఉన్నాడు.
అయితే మాల్యా ను భారత్ కు తిరిగి అప్పగించాలి అంటూ అక్కడి హైకోర్టు ను కోరడం తో వాదనలు విన్న కోర్టు అంగీకరిస్తూ మాల్యా ను భారత్ కు అప్పగించాలి అని తెలిపింది.దీనితో ఆ తీర్పును సవాల్ చేస్తూ భారత్ కు తిరిగి వెళ్లడం పై అభ్యంతరం వ్యక్తం చేసిన మాల్యా మరోసారి అక్కడి హైకోర్టు ను ఆశ్రయించగా తాజాగా ఆ పిటీషన్ ను కొట్టివేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.
ప్రస్తుతం కరోనా మహమ్మారి తో అల్లాడుతున్న దేశాల్లో లండన్ కూడా ఉండడం తో అక్కడ కూడా లాక్ డౌన్ అమలు అవుతుంది.ఈ క్రమంలో ఆయన పెట్టుకున్న పిటీషన్ ను ఇంగ్లండ్ అండ్ వేల్స్ హైకోర్టు కొట్టివేస్తున్నట్లు మెయిల్ ద్వారా తెలిపింది.దీనితో మాల్యా ఇక చచ్చినట్లు భారత్ కు తిరిగిరావాల్సిందే అన్నమాట.2009 లో బ్యాంకు రుణాలు కోరినప్పుడు తన కంపెనీల లాభదాయకతను తెలిసి తప్పుగా చూపించాడని భారత ప్రభుత్వం ఆరోపించింది.
ఈ అభ్యర్ధనల మేరకు అక్కడి కోర్టు మాల్యా ను తిరిగి భారత్ కు అప్పగించాలి అంటూ ఆదేశించింది.కానీ మాల్యా మాత్రం భారత్ కు తిరిగి రావడానికి ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు.
తాజాగా లాక్ డౌన్ కారణంగా ఆ అప్పీల్ ను కొట్టివేస్తున్నట్లు అక్కడి హైకోర్టు మెయిల్ ద్వారా వెల్లడించడం తో మాల్యా కు ఇప్పుడు తప్పించుకొనే అవకాశం లేకుండా పోయింది.