మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి చిత్రం తరువాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సనిమాపై భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమాలో చిరు రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది.
కాగా ఈ సినిమా కూడా సోషల్ మెసేజ్తో తెరకెక్కిస్తున్నాడు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ.అయితే గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్లో కొరటాల శివ నేచర్ను కాపాడే ప్రస్తావన తీసుకువచ్చాడు.ఇప్పుడు ఆచార్యలో కూడా ప్రకృత వనరుల గురించిన ప్రస్తావన తీసుకొస్తున్నాడు కొరటాల.
ఈ సినిమాలో మెగాస్టార్ ఈ అంశంపైనే పోరాటం చేయనున్నాడు.ఈ సినిమాలో జనతా గ్యారేజ్ అంశాలను కొరటాల చాలా వరకు చూపిస్తాడట.
మొత్తానికి జనతా గ్యారేజ్ షేడ్స్ను ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని చిత్ర యూనిట్ అంటోంది.ఈ సినిమాలో చిరు రెండు విభిన్న పాత్రల్లో నటించనున్నాడని, అందులో ఒకటి నక్సలైట్ పాత్ర కూడా ఉంటుందని తెలుస్తోంది.
ఈ సినిమాను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.