డాక్టర్‌పై ఉమ్మిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు

ఈ విపత్తు సమయంలో వైధ్యులు తమ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా కరోనాతో పోరాడుతూ ఉంటే కొందరు మాత్రం అత్యంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు.తమిళనాడులోని తిరుచ్చిరాపల్లికి చెందిన హాస్పిటల్‌లో ఒక కరోనా లక్షణాలున్న ఒక వ్యక్తి జాయిన్‌ అయ్యాడు.

 In Tamilandu Corona Patients Spits On Doctor And Police Registered The Attemp  T-TeluguStop.com

అతడికి చికిత్స అందించేందుకు వైధ్యులు ప్రయత్నిస్తూ ఉండగా అతడు మాత్రం నాకు ఎలాంటి రోగం లేదు నన్ను వెళ్లనివ్వండి అంటూ బలవంతంగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు.

వైధ్యులు అతడిని హాస్పిటల్‌లో బలవంతంగా ఉంచుతూ వస్తున్నారు.

ట్రీట్‌మెంట్‌కు అస్సలు సహకరించక పోవడంతో పాటు పదే పదే డాక్టర్‌లపైకి నర్స్‌లపైకి ఏది పడితే అది విసిరేయడం చేస్తున్నాడు.తాజాగా డాక్టర్‌పై ఏకంగా ఉమ్మేశాడు.

దాంతో డాక్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్యాయత్నం కేసును నమోదు చేశారు.పోలీసులు అతడిపై తీవ్రమైన చర్యలకు సిద్దం అయ్యారు.

డాక్టర్‌లపై ఈ సమయంలో ఎవరైనా దాడికి దిగితే కఠిన చర్యలు తప్పవంటూ తాజాగా తెలంగాణ పోలీసులు తీసుకు వచ్చిన చట్టంనే అక్కడ కూడా తీసుకురాబోతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube