ఈ విపత్తు సమయంలో వైధ్యులు తమ ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా కరోనాతో పోరాడుతూ ఉంటే కొందరు మాత్రం అత్యంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు.తమిళనాడులోని తిరుచ్చిరాపల్లికి చెందిన హాస్పిటల్లో ఒక కరోనా లక్షణాలున్న ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు.
అతడికి చికిత్స అందించేందుకు వైధ్యులు ప్రయత్నిస్తూ ఉండగా అతడు మాత్రం నాకు ఎలాంటి రోగం లేదు నన్ను వెళ్లనివ్వండి అంటూ బలవంతంగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు.
వైధ్యులు అతడిని హాస్పిటల్లో బలవంతంగా ఉంచుతూ వస్తున్నారు.
ట్రీట్మెంట్కు అస్సలు సహకరించక పోవడంతో పాటు పదే పదే డాక్టర్లపైకి నర్స్లపైకి ఏది పడితే అది విసిరేయడం చేస్తున్నాడు.తాజాగా డాక్టర్పై ఏకంగా ఉమ్మేశాడు.
దాంతో డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్యాయత్నం కేసును నమోదు చేశారు.పోలీసులు అతడిపై తీవ్రమైన చర్యలకు సిద్దం అయ్యారు.
డాక్టర్లపై ఈ సమయంలో ఎవరైనా దాడికి దిగితే కఠిన చర్యలు తప్పవంటూ తాజాగా తెలంగాణ పోలీసులు తీసుకు వచ్చిన చట్టంనే అక్కడ కూడా తీసుకురాబోతున్నారు.
.