తమిళంలో విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన రాచ్చసన్ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఇదే సినిమాని బెల్లంకొండ శ్రీనివాస్ తో రాక్షసుడుగా తెలుగులో రీమేక్ చేశారు.
ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ లో ఫస్ట్ సూపర్ హిట్ పడింది.సస్పెన్స్ సైకో థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.
ఇక నిర్మాత కోనేరు సత్యనారాయణకి కూడా కెరియర్ లో మొదటి సారి లాభాలు తెచ్చి పెట్టిన సినిమాగా రాక్షసుడు నిలిచిపోయింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
రాక్షసుడు సినిమాను తెలుగులో బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి నిర్మాత కోనేరు సత్యనారాయణ రెడీ అవుతున్నారు.ఇక ఈ సినిమాలో హీరో పాత్ర కోసం నిర్మాత కోనేరు సత్యనారాయణ బాలీవుడ్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాలో హీరోగా ఆయుష్మాన్ ఖురానా లేదా విక్కీ కౌశల్ ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారని తెలుస్తుంది.ఇక సౌత్ లో ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు, హిందీ ప్రేక్షకులు ఇలాంటి సినిమాకి భాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉండటంతో దీనిని బాలీవుడ్ లో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.
మరి ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.