అయితే ఇటీవల కాలంలో జబర్దస్త్ కామెడీ షో లో కమెడియన్ గా పని చేస్తున్నటువంటి దొరబాబు విశాఖ పట్టణంలోని ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడిన సంగతి అందరికీ తెలిసినదే.అయితే ఆ తరువాత దొరబాబు తన స్నేహితులను కలవడం కోసం వెళ్ళాడని అతడి తప్పేమీ లేదని అప్పట్లో దొరబాబు సంబంధించినటువంటి కొందరు సన్నిహితులు వివరణ ఇచ్చారు.
అయితే దొరబాబుకి సంబందించిన ఈ విషయం గురించి కొందరు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.అంతేకాక దొరబాబు పై ఉన్నవీ లేనివీ కల్పించి తప్పుడు ప్రచారాలు చేస్తూ బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు.
దీంతో తాజాగా ఈ విషయంపై దొరబాబు భార్య నందిని రెడ్డి అలియాస్ అమూల్య స్పందించింది.ఇందులో భాగంగా తన భర్తపై ఉన్నవీ లేనివీ కల్పించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి వారికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది.
ఇందులో తన భర్త గురించి తప్పుగా మాట్లాడుతున్న వారిని కుక్కల తో పోలుస్తూ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ అంటూ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.దీంతో నందిని రెడ్డి చేసినటువంటి ఈ పనికి నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
అంతేగాక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా చేసేటటువంటి అసభ్యకర కామెంట్లను పట్టించుకోవద్దంటూ నందినిరెడ్డికి సూచిస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో కూడా దొరబాబు గురించి కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు కామెంట్లు చేసిన వారిని సోషల్ మీడియాలో నందినీరెడ్డి బాగానే ఆడుకుంది.
అయితే ప్రస్తుతం దొరబాబు టాలీవుడ్ కి సంబంధించిన పలు చిత్రాల్లో నటిస్తున్నాడు.మరోపక్క యధావిధిగా జబర్దస్త్ కామెడీ షో లో హైపర్ ఆది టీం లో కమెడియన్ గా పని చేస్తున్నాడు.