మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఆటో జానీ చిత్రాన్ని చేయాలని అనుకున్నారు.కథ కూడా సిద్దం అవుతున్నట్లుగా మెగా వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
పూరి జగన్నాధ్ కథ వినిపించాడని కూడా వర్తాలు వచ్చాయి.అయితే అనూహ్యంగా ఖైదీ నెం.150 చిత్రాన్ని వినాయక్ దర్శకత్వంలో చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా మెగాస్టార్ ప్రకటించడంతో పూరి కూడా అవాక్కయ్యాడు.
తాను తయారు చేసిన కథ మొదటి సంగం బాగుందని అన్నాడు.రెండవ సగంలో మార్పులు చెప్పిన చిరంజీవి ఇప్పుడు ఎందుకు మొత్తానికి ఆ కథను వద్దనుకున్నాడో అర్థం కాలేదు.అయితే ఈ విషయాన్ని ముందే చెప్పి ఉంటే బాగుండేది అంటూ పూరి ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే పూరి మళ్లీ ఇప్పుడు చిరంజీవి కోసం స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన పూరి స్క్రిప్ట్ పనిలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
ఒక స్టార్ హీరో కోసం తాను స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను అంటూ ప్రకటించిన నేపథ్యంలో మళ్లీ ఆటో జానీ గురించిన వార్తలు వస్తున్నాయి.
చిరంజీవి మాస్ బాడీ లాంగ్వేజ్కు తగ్గట్లుగా మెకానిక్ అల్లుడు తరహాలో ఒక మంచి మస్ మసాలా ఎంటర్టైనర్గా ఈ చిత్రంను తెరకెక్కించేందుకు పూరి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈసారి స్క్రిప్ట్ వర్క్ నచ్చితే తప్పకుండా వెంటనే సినిమా చేద్దామని ఇటీవలే పూరికి చిరు హామీ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి.