ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో యావత్ భారతదేశంలో లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం.దీంతో అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది.
ఈ లాక్ డౌన్ ఏకంగా 21 రోజులపాటు ఉండటంతో అందరూ తమ ఇంటి పనులతో సమయాన్ని గడుపుతున్నారు.
కాగా అందాల భామ అదా శర్మ సినిమాల్లో తక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ గడుపుతుందనే విషయం అందరికీ తెలిసిందే.
సాధారణంగానే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ, ఇప్పుడు చేసే ప్రతి పనిని కూడా సోసల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ను అలరిస్తోంది.తాజాగా అదా శర్మ ఇంట్లో పరిశుభ్రతను పాటించేలా ఇల్లు తుడుస్తూ తీసిన ఓ వీడియో వైరల్గా మారింది.
పొట్టి బట్టలతో అమ్మడు చేసే అందాల ఆరబోత ఇక్కడ కూడా వదల్లేదు.
దీంతో కరోనా ఉన్నా తమ అభిమాన నటి అందాల ఆరబోతతో కరోనా సెలవులను ఎంజాయ్ చేస్తున్నామంటూ ఆమె ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.