మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో దాదాపు 9 ఏళ్ల తరువాత రీఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150 చిత్రంతో అదిరిపోయే సక్సెస్ను అందుకున్నాడు.ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలవడంతో, తన 151వ చిత్రాన్ని ఓ పీరియాడికల్ మూవీగా చిరు తెరకెక్కించాడు.
సైరా నరసింహారెడ్డి సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు.తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు చిత్ర యూనిట్.
ఇక ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ బడ్జెట్తో పలు భాషల్లో రిలీజ్ చేశారు.అయితే ఈ సినిమా కేవలం సక్సెస్ను మాత్రమే అందుకోవడంతో చిరు చాలా నిరాశకు లోనయ్యారు.
భారీ ఆశలు పెట్టుకున్న ఈ పీరియాడికల్ మూవీ తనకు నిరాశను మిగిల్చిందని చిరు ఓ సందర్భంలో తెలిపారు.అయితే ఇప్పుడు ఓ సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ ఎంటర్టైనర్తో మనముందుకు రావడానికి చిరు రెడీ అవుతున్నారు.
ఈ సందర్భంలో చిరుకు మరో పీరియాడికల్ సబ్జెక్ట్ను ఓ దర్శకుడు వినిపించినట్లు తెలుస్తోంది.కథ విన్న చిరు పీరియాడికల్ సినిమాకు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.
కొంతకాలం వరకు కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం అవుతానని ఆయన అన్నారట.మొత్తానికి సైరా చిత్రంతో పీరియాడికల్ చిత్రాలకు చిరు ఫుల్స్టాప్ పెట్టేశారని కొందరు ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.