మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే కీలక షెడ్యూల్ను షూట్ చేస్తున్న చిత్ర యూనిట్ కరోనా కారణంగా షూటింగ్ను నిలిపివేశారు.
అయితే ఈ సినిమాలో చిరు రెండు విభిన్న పాత్రల్లో మనకు కనిపిస్తాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా తొలుత త్రిషను తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుండి వైదొలిగింది.ఆ తరువాత ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశంపై చాలా సస్పెన్స్ నడిచింది.కాగా చివరకు ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు.గతంలో చిరు సరసన కాజల్ ఖైదీ నెంబర్ 150లో నటించిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.దీంతో మరోసారి ఆమెను ఈ సినిమాలో తీసుకున్నారు.
కాగా ఈ సినిమా కోసం కాజల్ భారీ పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఆచార్య సినిమాలో నటించేందుకు కాజల్కు ఏకంగా కోటిన్నర చెల్లిస్తున్నారట చిత్ర నిర్మాత.కాజల్ ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.