టాలీవుడ్లోకి వచ్చీరావడంతోనే న్యాచురల్ స్టార్ నాని నటించినటువంటి మజ్ను అనే చిత్రంతో ఫర్వాలేదనిపించిన ముద్దుగుమ్మ అను ఇమ్మానియేల్.అయితే వచ్చిన మొదట్లో ఈ అమ్మడు బాగానే అవకాశాలు రాబట్టుకుంది.
కానీ కథల విషయంలో సరైన అవగాహన లేకపోవడంతో ఈ అమ్మడు నటించినటువంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి.అయితే ఇందులో స్టైలిష్ స్టార్ బన్నీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రాలు కూడా బోల్తా పడడంతో ప్రస్తుతం అను ఇమ్మానియేల్ గడ్డుకాలం ఎదుర్కొంటోంది.
అయితే తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్నటువంటి ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు సమాచారం.అంతేగాక ఈ చిత్రానికి కి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఈ అమ్మడు తన ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకుంది.ప్రస్తుతం అను ఇమ్మానియేల్ చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో కచ్చితంగా తన నటన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఇదేనని అభిప్రాయ పడుతున్నారు కొందరు సినీ విశ్లేషకులు.
అయితే అందం, అభినయంతో చక్కగా ఉండేటువంటి అను ఇమ్మానియేల్ ఎందుకో అవకాశాలను దక్కించుకోలేకపోతోంది.అయితే నటన పరంగా కూడా సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్న టువంటి అను ఇమ్మానియేల్ ఇలా అవకాశాలు లేకుండా ఖాళీగా గడుపుతుండడంతో ఆమె అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు.అయితే టాలీవుడ్ లో అను ఇమ్మానియేల్ చివరగా అక్కినేని హీరో నాగచైతన్య నటించినటువంటి శైలజ రెడ్డి అల్లుడు అనే చిత్రంలో హీరోయిన్ గా కనిపించింది.అయితే ఆ తర్వాత ఇక మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు.