సెలబ్రెటీలు మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలి.సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండకుంటే ఏదో ఒక తప్పు దొర్లడం ఆ తర్వాత తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవడం జరుగుతుంది.
గతంలో పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తప్పు తెలుసుకుని డిలీట్ చేసినా కూడా విమర్శలు తప్పలేదు.ఇప్పుడు అదే పరిస్థితిని హిట్ హీరో విశ్వక్సేన్ ఎదుర్కొంటున్నాడు.
హీరో విశ్వక్ సేన్ తాజాగా జనతా కర్ఫ్యూ గురించి మాట్లాడుతూ అయిదు గంటల తర్వాత బయటకు వచ్చిన జనాలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.టీ స్టాల్ వద్ద ఉప్పర్ మీటింగ్ ఏంట్రా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మీడియాలో వైరల్ అయిన వీడియోపై కొందరు విమర్శలు గుప్పించారు.ముఖ్యంగా ఈ వీడియో ఉప్పర్ వాళ్ల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉందంటూ కామెంట్స్ వచ్చాయి.దాంతో వారంతా కూడా విశ్వక్సేన్పై సోషల్ దాడికి సిద్దం అయ్యారు.
ఆ నేపథ్యంలో విశ్వక్ సేన్ ఉప్పర్ వాళ్లకు క్షమాపణలు చెప్పాడు.తాను ఎవరి మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడలేదని, తన ఉద్దేశ్యం పూర్తి వేరు అంటూ చెప్పుకొచ్చాడు.