తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియనివారుండరు.మొదట ఒక చిన్న సాధారణ నటుడిగా తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి తర్వాత ఒక స్టార్ గా ఎదిగినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత జనరేషన్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
అంతేకాక సినీ కెరీర్లో మంచి ఫామ్ లో ఉన్నటువంటి చిరంజీవి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి అక్కడ కూడా ప్రజల మన్ననలు పొందారు.
అయితే సినిమాలు, రాజకీయాల పరంగా ఎంతో ఎంతో యాక్టివ్ గా ఉండేటువంటి చిరంజీవి సోషల్ మీడియా వైపు మాత్రం ఎందుకో ఆసక్తి కనబర్చడం లేదు.
అందువల్ల ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు.అయితే తాజాగా మెగాస్టార్ సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్నానని అంటూ ఓ వీడియోని అధికారికంగా విడుదల చేశాడు.ఈ వీడియోలో తన హావ భావాలను తన అభిమానులతో పంచుకోవడం కోసం తాను సోషల్ మీడియాలో ఇకనుంచి యాక్టివ్ గా ఉంటానంటూ చెప్పుకొచ్చాడు.దీంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
తమ అభిమాన నటుడు సోషల్ మీడియా లోకి వస్తే మరింత దగ్గరగా ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 50 శాతం చిత్రీకరణ కూడా పూర్తయింది.
అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుండడంతో కొంత కలం పాటూ షూటింగ్ వాయిదా వేస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.
.