టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఎంతగా కలకలం సృష్టిస్తుందో చెప్పనవసరం లేదు.అయితే ఈ కరోనా వైరస్ ని అరికట్టేందుకు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇందులో భాగంగా ఇప్పటికే టాలీవుడ్ స్టార్లు కూడా సెల్ఫ్ క్వారైంటన్ ని పాటిస్తున్నారు.అయితే మొన్నటి రోజున కరోనా వైరస్ ని నిర్మూలించడానికి నిర్వహించిన జనతా కర్ఫ్యూ లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఆ తర్వాత ప్రజలు యధావిధిగా రోడ్లపై తిరగడం ప్రారంభించారు.దీంతో పలువురు సెలబ్రిటీలు ప్రజలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా యాంకర్ సుమ ఈ విషయంపై స్పందించారు.ఇందులో భాగంగా యాంకర్ సుమ ఓ వీడియోని రూపొందించి తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.ఇందులో పోతావురా అరేయ్ పోతావ్ అంటూ తనదైన శైలిలో నిరసన తెలియజేసింది.అలాగే దయచేసి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరూ బయటకు రావొద్దంటూ ఇలా కొద్దిరోజులు చేస్తే కరోనా మహమ్మారిని తరిమి కొట్టవచ్చునని తెలిపింది.
ఒకవేళ ఇలా చేయకుండా బయటకు వస్తే యధావిధిగా కరోనా వైరస్ వ్యాప్తి చెంది అందరికి నష్టం వాటిల్లుతుందని కూడా తెలిపారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ప్రజలు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి బయట ఎదురుగా తిరుగుతుండడంతో టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ కూడా ఈ విషయంపై స్పందించారు.ఇందులో భాగంగా విశ్వక్ సేన్ వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.అయితే ఇందులో కర్ఫ్యూ అయిపోయిన తర్వాత వెంటనే బయట తిరగడం ఏంటని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.