టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో కాంబినేషన్ సినిమాలు, మల్టీ స్టారర్ ఎక్కువగా వస్తున్నాయి.ప్రస్తుతం వి సినిమా మల్టీ స్టారర్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
ఇక ఆచార్య మూవీలో కూడా చిరంజీవితో పాటు చరణ్ నటిస్తాడని టాక్ వినిపిస్తుంది.మరో వైపు భారీ మల్టీ స్టారర్ మూవీగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతుంది.
ఇదిలా ఉంటే మరికొన్ని మల్టీ స్టారర్ మూవీల గురించి చర్చ నడుస్తుంది.ఇప్పుడు టాలీవుడ్ లో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.
అది బాలకృష్ణ-ఎన్టీఆర్ మల్టీ స్టారర్ మూవీ.
బాబాయ్-అబ్బాయ్ కలిసి సినిమాలో నటిస్తే చూడాలని చాలా కాలంగా నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అయితే కొంత కాలం వీరి మధ్య వైరం నడిచిన కూడా తారక్ ఎప్పుడు కూడా బాలకృష్ణ మీద తన ప్రేమ చూపించుకుంటూ వస్తున్నాడు.హరికృష్ణ మరణం తర్వాత వీరు కలిసారు.
ఈ నేపధ్యంలో మళ్ళీ వీరి జోడిపై చర్చ నడుస్తుంది.త్వరలో ఈ కల నెరవేరబోతుంది అనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది.
మలయాళీలో సూపర్ హిట్ అయిన మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రెడీ అవుతుంది.అయ్యప్పనుమ్ కొశియమ్ అనే ఈ సినిమాని బాలకృష్ణ-తారక్ కాంబినేషన్ లో తెరకెక్కించాలని నిర్మాత భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఒక వేళ బాలకృష్ణ కాదంటే కళ్యాణ్ రామ్-తారక్ తో అయిన చేయాలని చూస్తున్నట్లు సమాచారం.మరి ఈ కాంబినేషన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.