థ్యాంక్యూ అంటూ నాగచైతన్య మళ్ళీ ఆమెను కంటిన్యూ చేస్తాడా...

2014 సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ మరియు నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చినటువంటి “మనం” అనే చిత్రం ఎంత మంచి హిట్ అయిందో పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు విక్రమ్ కుమార్ సినిమాలో నాగచైతన్య నటించలేదు.

 Naga Chaitanya Will Continue With Pooja Hegde In Upcoming Project-TeluguStop.com

దీంతో ఈ ఏడాదిలో మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతున్నట్లు సమాచారం.

అయితే తాజా సమాచారం ప్రకారం ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ అక్కినేని నాగ చైతన్య కోసం ఓ కథని సిద్ధం చేశాడట.

అయితే ఇప్పటికే ఈ స్క్రిప్ట్ ను హీరో నాగ చైతన్యకు వినిపించగా కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.అయితే ఇంటర్వెల్ తర్వాత వచ్చేటటువంటి కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేర్పులు చేయవలసినదిగా దర్శకుడు విక్రమ్ కుమార్ కి సూచించాడట.

అయితే ఎలాగో ప్రస్తుతం నాగచైతన్య ఇతర సినిమాల్లో బిజీగా ఉండటంతో అవన్నీ పూర్తయ్యేటప్పటికి ఈ కథ కూడా సిద్ధం చేస్తానని చెప్పాడట.అయితే ఈ చిత్రానికి “థాంక్యూ” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

 అలాగే ఈ చిత్రంలో గతంలో నాగచైతన్య సరసన ఒక లైలా కోసం అనే చిత్రంలో నటించిన టువంటి హీరోయిన్ పూజా హెగ్డే తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.

-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నాగ చైతన్య “లవ్ స్టోరీ” అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి చిత్రీకరణ పూర్తవడంతో ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేసేందుకు దర్శకుడు శేఖర్ కమ్ముల యత్నాలు చేస్తున్నాడు.

కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ఈ చిత్ర విడుదలను వాయిదా వెయ్యనున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube