శర్వానంద్.ఎంత సహజ నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తీసిన సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా అతని నటన చూడటం కోసమే వెళ్తారు ప్రేక్షకులు.మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరకు పరిచయమైనా శర్వానంద్ తన నటనతో మంచి హీరోగా ఎదిగాడు.
ఇటీవలే కాలంలో వరుసగా సినిమాలు ప్లాప్ అయ్యాయి.
దీంతో ఇప్పుడు తీసే సినిమాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తమిళంలో ఓ సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు.డాన్స్ మాస్టర్ రాజు సుందరం దర్శకుడు అవతారం ఎత్తనున్నాడు.
ఓ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.ఆ సినిమాలోనే శర్వానంద్ కథానాయకుడిగా నటించనున్నాడు.
అయితే ఈ సినిమా తమిళంలో నిర్మితం కానుంది.ఇక్క విశేషం ఏంటి అంటే.సూపర్ హిట్ చిత్రం ”జర్నీ” తరువాత తమిళంలో శర్వానంద్ నటిస్తున్న సినిమా ఇదే.అయితే ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ను మే నెలాఖరు నుంచి ఆరంభించనున్నారు.అయితే ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నట్టు సమాచారం.