ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో రామ్.ఈ సినిమాతో సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో రామ్లు అదిరిపోయే బ్లాక్బస్టర్ను అందుకున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నిధి అగర్వాల్, నభా నటేష్లు నటించారు.వారిద్దిరికి కూడా ఈ సినిమా అదిరిపోయే సక్సెస్ను తెచ్చిపెట్టడంతో వారు తమ తరువాత సినిమాలపై ఫోకస్ పెట్టారు.
ఇక ఈ సినిమాకు ముందు కూడా నిధి అగర్వాల్ పలు సినిమాలు చేసింది.అయినా ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అమ్మడికి మంచి క్రేజ్ వచ్చి పడింది.కానీ సినిమా అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు.
అయినా వచ్చిన అవకాశాలను పూర్తిగా వాడుకుంటోంది ఈ బ్యూటీ.కాగా తాజాగా ఓ చిత్రంలో ఐటెం సాంగ్ చేయడానికి నిధి అగర్వాల్ కళ్లుచెదిరే రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.
ఒక్క పాటలో చిందేయడానికి ఏకంగా రూ.60 లక్షల డిమాండ్ చేస్తుందట ఈ భామ.ఒక్క పాటకు ఇంత మొత్తం డిమాండ్ చేయడంతో సదరు చిత్ర యూనిట్ నోరెళ్లబెట్టిందట.మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ క్రేజ్ను పూర్తిగా వాడుకుంటోన్న నిధి అగర్వాల్, తమిళంలో జయం రవి నటిస్తున్న భూమి చిత్రంలో నటిస్తోంది.
ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.