మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాతో మన ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకొని తన జోరును కొనసాగించాలని తేజు ప్రయత్నిస్తు్న్నాడు.
కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని కూడా లైన్లో పెట్టే పనిలో పడ్డాడు ఈ హీరో.
ప్రస్థానం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దేవా కట్టా డైరెక్షన్లో తేజు ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు కూడా సాగాయి.త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది.కాగా ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.ఈ చిత్రంలో ఆమె చేయబోయేది ఓ లేడీ సీఎం పాత్రగా తెలుస్తోంది.
డాక్టర్ పాత్రలో తేజు సీఎం దురాగతాలను ఎలా ఎదుర్కొన్నాడనేది సినిమా కథ అని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
దేవా కట్టా పక్కా స్క్రిప్టుతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.
తేజు కెరీర్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.నివేథా పేతురాజ్ హీరోయిన్గా నటించనున్న ఈ సినిమా షూటింగ్ను ఏప్రిల్ 20 నుంచి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.