సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ తరువాత తన నెక్ట్స్ మూవీని దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే.కానీ వంశీ సరైన స్క్రిప్టును రెడీ చేయలేదని ఆ సినిమాను మహేష్ క్యాన్సిల్ చేశాడంటూ వార్తలు వచ్చాయి.
ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్లో మహేష్ చేయబోయే సినిమాకు పరశురామ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నట్లు వార్తలు రావడంతో వంశీ పైడిపల్లి సినిమా అటకెక్కిందని దాదాపు అందరూ ఫిక్స్ అయ్యారు.
కానీ మహేష్కు మహర్షి లాంటి బ్లాక్బస్టర్ హిట్ అందించిన వంశీ పైడిపల్లితో సినిమా ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది.
స్క్రిప్టును రీవర్క్ చేయాల్సిందిగా మహేష్ కోరడంతో వంశీ అదే పనిలో బిజీగా ఉన్నాడు.ఈ స్క్రిప్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి మహేష్తో సినిమాను చేసి తీరాలని వంశీ భావిస్తున్నాడు.
దీంతో ఈ కాంబోలో సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
మరి వంశీతో సినిమా ఉంటే, పరశురామ్ సంగతి ఏమిటని పలువురు అంటున్నారు.
ఏదేమైనా మహేష్తో సినిమాకు డైరెక్టర్లు పోటీ పడుతుండటంతో ఆయన నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.