యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ డియర్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
భారీ బడ్జెట్ అవ్వడంతో పాటు చాలా అంచనాలు ఉన్న కారణంగా ఈ సినిమాను అంత సింపుల్గా విడుదల చేయాలనుకోవడం లేదు.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం తర్వాత ప్రభాస్ చేయబోతున్న సినిమా అంటూ అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఓ డియర్ చిత్రం తర్వాత ప్రభాస్ చేయబోతున్న సినిమాకు సందీప్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ కొన్ని రోజులు.కొన్ని రోజులు బాబీ అని మరికొన్ని రోజులు మరో దర్శకుడి పేరు ప్రచారం జరుగుతోంది.ఇప్పుడు భీష్మ దర్శకుడు కూడా ఆ జాబితాలో చేరాడు.ప్రస్తుతం ప్రభాస్ ఒక ఆల్ ఇండియా సూపర్ స్టార్.అలాంటి స్టార్ హీరో ఇలాంటి చిన్న దర్శకులతో చేస్తాడా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఈ పుకార్లు నమ్మడం లేదు.ఇవన్నీ కూడా పుల్కా పుకార్లు అంటూ కొట్టి పారేస్తున్నారు.ఎట్టి పరిస్థితుల్లో ప్రభాస్ తదుపరి చిత్రం బాలీవుడ్ రేంజ్లో ఉంటుందని వారు నముతున్నారు.
కరణ్ జోహార్ నిర్మాణంలో ఒక భారీ హిందీ సినిమాను ప్రభాస్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వారు నమ్మకంగా ఉన్నారు.మరి అది ఎంత వరకు నిజమో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.
ప్రభాస్ కొత్త సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో వచ్చే అవకాశం ఉంది.