పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన 26వ చిత్రం పింక్ రీమేక్లో నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంను దిల్రాజు నిర్మిస్తున్నాడు.
ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో పవన్ తన 27వ చిత్రాన్ని చేస్తున్నాడు.ఇప్పటికే అది కూడా షూటింగ్ ప్రారంభం అయ్యింది.
ఇక మరో నెల రోజుల్లో హరీష్ శంకర్ మూవీలో కూడా పవన్ నటించబోతున్నాడు.ఈ మూడు అధికారిక ప్రటన వచ్చాయి.
ఈ మూడు ఇదే ఏడాదిలో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈమూడు సినిమాలు కాకుండా పవన్ ఇంకో మూడు సినిమాలను కూడా ఓకే చేసినట్లుగా సమాచారం అందుతోంది.పవన్ గోపాల గోపాల చిత్రంకు డాలీ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.ఆయన దర్శకత్వంలో పవన్ ఒక సినిమాను చేయబోతున్నాడట.
అది కూడా గోపాల గోపాలకు సీక్వెల్గా ఉంటుందని సమాచారం అందుతోంది.ఇక గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో పవన్ చేశాడు.
ఆయన దర్శకత్వంలో కూడా పవన్ మరో సినిమాను చేయబోతున్నాడు.
ఇక తాజాగా మరో ప్రముఖ నిర్మాతకు కూడా పవన్ ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం ఈమూడు సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.వచ్చే ఏడాదిలో ఈ మూడు సినిమాలు ఉంటాయని సమాచారం అందుతోంది.త్వరలోనే ఈ మూడు సినిమాల టైటిల్స్ను ప్రకటించబోతున్న పవన్ ఆ మూడు సినిమాలను ఎప్పుడు ప్రకటిస్తాడో చూడాలి.
—
.