ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు అట్టప్ ఫ్లాప్ లు చవిచూసిన దర్శకుడు శ్రీనువైట్ల మరో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇన్ని ఫ్లాప్ ల తర్వాత ఏ దర్శకుడికి అయినా అసలు ఆఫర్లు రావడమే మహా గగనం.
అలాంటిది ఈయన స్టార్ హీరోలతో సినిమాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.గత వారంలో మహేష్ బాబును కలిసి శ్రీనువైట్ల కథను వినిపించాడట.
దూకుడు స్థాయిలో మరో విజయాన్ని మీకు ఇస్తానంటూ నమ్మకంగా చెప్పే ప్రయత్నం చేశాడట.కాని మహేష్ బాబు మాత్రం ఆసక్తి చూపించలేదు.
ప్రస్తుతానికి తాను కమిట్ అయిన ప్రాజెక్ట్ లు పూర్తి అయిన తర్వాత చూద్దాం అని తప్పించుకున్నాడట.దూకుడు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీనువైట్ల ఆగడు వంటి డిజాస్టర్ ను కూడా మహేష్ కు ఇచ్చిన విషయం తెల్సిందే.దూకుడుతో పాటు ఆగడు కూడా మహేష్ బాబుకు గుర్తుండి ఉంటుంది.అందుకే నో చెప్పాడు.ఇక తాజాగా చిరంజీవిని కూడా శ్రీనువైట్ల కలిసినట్లుగా సమాచారం అందుతోంది.
చిరంజీవి కూడా స్టోరీ లైన్ విని బాగుందని చెప్పాడట.కాని ప్రస్తుతానికి వేరే సినిమాలు కమిట్ అయ్యి ఉన్న కారణంగా మరో హీరోను చూసుకోవాల్సిందిగా సూచించాడట.దాంతో శ్రీనువైట్ల మరో హీరోను వెదికే పనిలో ఉన్నాడు.
స్టార్ హీరోలను ఒప్పించేందుకు ప్రయత్నించడం కంటే ఒక చిన్న హీరోతో ఈయన సినిమా చేస్తే బాగుంటుంది.ఆమద్య హీరో రామ్ను కూడా ఈయన కలిశాడు.
ఆయన కూడా చూద్దాం అన్నట్లుగానే సమాధానం ఇచ్చాడట.స్టార్ హీరోలతో సినిమా చేయాలనే ఈయన ప్రయత్నం సఫలం అయ్యేనా చూడాలి.