భారతీయురాలి మెడలోంచి బంగారు చైన్ను దొంగిలించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ పౌరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.గతేడాది నవంబర్ 30న దుబాయ్లో నివసిస్తున్న 32 ఏళ్ల భారతీయ మహిళ స్థానికంగా ఉన్న క్లినిక్ నుంచి రాత్రి 10 గంటల ప్రాంతంలో తన ఇంటికి తిరిగి వెళ్తోంది.
ఈ సమయంలో 23 ఏళ్ల పాక్ జాతీయుడు ఆమెను గమనించి వెనకాలే వెళ్లి, మెడలోని చైన్ను లాగేందుకు యత్నించాడు.ప్రమాదాన్ని పసిగట్టిన ఆమె గొలుసును గట్టిగా పట్టుకుని సహాయం కోసం కేకలు వేసింది.
ఆమె అరుపులు విన్న ఇద్దరు వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చి దొంగను పట్టుకున్నారు.అయితే గొలుసు కోసం దుండగుడు బలంగా లాగడంతో ఆమె మెడపై గాయాలయ్యాయి.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారతీయురాలిని దొంగ బారి నుంచి కాపాడటానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా పాకిస్తాన్ జాతీయులు కావడం గమనార్హం.వీరిలో ఒకరు 41 వ్యాపారవేత్త కాగా, 21 ఏళ్ల క్యాబ్ డ్రైవర్.నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచగా, కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.