కుర్ర హీరో భీష్మతో తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది.నితిన్ కెరియర్ లో అఆ సినిమా తర్వాత మరో బిగ్గెస్ట్ హిట్ అయ్యే దిశగా ఈ సినిమా దూసుకుపోతుంది.
ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది భీష్మ సక్సెస్ మీద స్పందించి నితిన్ కి అభినందనలు తెలిపారు.ఇదిలా ఉంటే తాజాగా భీష్మ చిత్ర యూనిట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిసారు.
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నితిన్ హార్డ్ కోర్ ఫ్యాన్ అనే విషయం అందరికి తెలిసిందే.ఇక పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే నితిన్ సినిమాలలోకి వచ్చాడు.
నితిన్ అవకాశం దొరికినప్పుడల్ల పవన్ కళ్యాణ్ మీద తన ప్రేమని చూపిస్తూ ఉంటాడు.
భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో కూడా నితిన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ మేలో థియేటర్ లో పవన్ కళ్యాణ్ కోసం చొక్కాలు చింపుకోవడానికి రెడీ అయిపోదాం అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు భీష్మ సినిమా రిలీజ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.మరో వైపు మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.పవన్ కళ్యాణ్ ని హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల, సితార ఎంటర్టయిన్ మెంట్స్ నిర్మాత నాగవంశీ కలుసుకొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.దీనికి సంబంధించిన ఫొటోలను నితిన్ ట్విట్టర్ లో షేర్ చేశారు.
భీష్మ సక్సెస్ సందర్భంగా పవన్ కళ్యాణ్ భీష్మ చిత్రబృందాన్ని అభినందించారు.పవన్ కళ్యాణ్ తో గడిపిన క్షణాలు ఎప్పటికి మరిచిపోలేనని, ఎప్పటికి మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అని ట్విట్టర్ లో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.