టాలీవుడ్ లో ఒకప్పుడు విక్టరీ వెంకటేష్ మరియు నాగార్జున తదితరులతో ఆడిపాడిన ముద్దుగుమ్మటబు ఇప్పటికే అందరికీ బాగానే గుర్తు ఉంటుంది.ఇందులో ఇప్పటికీ కొందరికి ఈ అమ్మడు విక్టరీ వెంకటేష్ తో కలిసి చిందులు వేసినటువంటి “కొత్త కొత్తగా ఉన్నది” అనే పాట తమ ఇష్టమైన పాటల జాబితాలో ఉంటుంది.
అయితే ఒకప్పుడు దాదాపుగా స్టార్ హీరోల సరసననటించినటువంటి ఈ అమ్మడు వయసు పైబడటంతో గ్లామర్ కి తక్కువ ప్రాధాన్యతనిస్తూ తన పాత్రకి ఎక్కువ ప్రాధాన్యం ఉండేటువంటి పాత్రలో నటిస్తోంది.అయితే తాజాగా గత వారం రోజుల నుండి ప్రముఖ ఫోటోషూట్ సంస్థ అయినటువంటి డబ్బూ రత్నాని క్యాలెండర్ 2020 కోసం పలువురు నటీమణులు తమ అందాల ఆరబోతతో ఫోజులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా నటి టబు కూడా ఈ క్యాలెండర్ కోసం తన అందాలు ఆరబోసింది.అంతేగాక ఈ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన అభిమానులతో పంచుకుంది.
ఈ ఫోటోలో టబు కొబ్బరి ఆకులను అడ్డుపెట్టుకొని ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోజులు ఇచ్చింది.దీంతో టబూ ఫోటోకి అభిమానులు ఫిదా అయ్యారు.అంతేగాక వయసు పరంగా 48 ఏళ్ళు దాటినప్పటికీ తన వన్నె తరగని అందంతో ఇప్పుడున్నటువంటి స్టార్ హీరోయిన్లకు సైతం దీటుగా పోటీ ఇస్తోంది అంటూ తన అందాన్ని పొగుడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే మరికొందరు తాజాగా ఈ అమ్మడు నటించిన టువంటి అల వైకుంఠ పురం లో చిత్రంలోని అల్లు అర్జున్ చెప్పినటువంటి మేడం సార్….
మేడం అంతే అనే డైలాగ్ ని టబు కి వల్లిస్తున్నారు.అయితే ఇదే రీతిలో మొన్న కూడా భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు సరసన ఆడిపాడిన అటువంటి కియారా అద్వానీ కూడా ఇదేవిధంగా అరటి ఆకు ని అడ్డుపెట్టుకొని ఫోజులిచ్చింది.
అయితే ఈ అమ్మడు తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన టువంటి అల వైకుంఠ పురంలో చిత్రంలో అల్లు అర్జున్ కి తల్లి పాత్రలో నటించింది.ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడమే కాకుండా అల్లు అర్జున్ కెరీర్లోనే బెస్ట్ చిత్రంగా నిలిచింది.అయితే టబు ప్రస్తుతం “జవానీ జానెమాన్” అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు నితిన్ కాక్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.