టాలీవుడ్, కోలీవుడ్, సాండల్ వుడ్, తదితర సినీ పరిశ్రమలో దాదాపుగా అందరి హీరోల సరసన నటించిన టువంటి హీరోయిన్లలో నయనతార ఒకరు.అంతేగాక ఈ అమ్మడు హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాల్లో నటిస్తూ తన పని తాను చేసుకుంటూ వెళుతోంది.
ఇలా ఉండగా ప్రస్తుతం నయనతార పారితోషకం గురించి పలు కథనాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇందులో ఒక చిత్రంలో నటించాలంటే నయనతార తీసుకునే పారితోషకం ఒకెత్తయితే ఆమె వ్యక్తిగతంగా చేసేటటువంటి ఖర్చులను కూడా సినీ నిర్మాతలు పైన మోపుతోందని పలు కథనాలు వినిపిస్తున్నాయి.
అంతేగాక ఈ మధ్యకాలంలో నయనతార ఓ చిత్రానికి ప్రముఖ సినీ నిర్మాత రాజన్ నిర్మాతగా వ్యవహరించారు.ఈ చిత్రం నిర్మిస్తున్న సమయంలో నయనతార తన అసిస్టెంట్లు జీతాలు కూడా నిర్మాత మీదే మోపినట్లు తెలుస్తోంది.
దీనికితోడు హోటల్ బిల్లులు, ఫుడ్, షాపింగ్ బిల్లులు, ఇలా తదితర బిల్లులను మోపడంతో దాదాపుగా నయనతారకి పారితోషికంతో పాటు మరో 25 శాతం డబ్బుని అదనంగా చెల్లించినట్లు సమాచారం.
ఈ విషయాన్ని ప్రజలు కూడా పలుమార్లు చెప్పు కొచ్చిన సందర్భాలున్నాయి.దీంతో నిర్మాత మండలి సభ్యులు కూడా నయనతార కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేందుకే సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా తమ సినిమాల్లో నటించేటప్పుడు కేవలం పారితోషికం మాత్రమే ఇస్తామని మరే ఇతర బిల్లులు కి తాము బాధ్యులం కాదని తెగేసి చెప్పాలనుకుంటున్నట్లు సమాచారం.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నయనతార రజనీకాంత్ నటిస్తున్న అటువంటి ఓ చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శివ దర్శకత్వం వహిస్తున్నాడు.
అలాగే ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న అటువంటి మరో చిత్రంలో కూడా నయనతార నటిస్తోంది.