తెలుగులో స్టార్ హీరో సేమ్ కలిగినటువంటి దాదాపు అందరు హీరోలతో నటించిన హీరోయిన్లలో అందాల తార త్రిష ఒకరు.అయితే ఈ అమ్మడు అప్పట్లో కెరియర్ లో బాగానే రాణిస్తున్న సమయంలో పెళ్లి కుదిరే నిశ్చితార్థం కూడా చేసుకుంది.
అయితే ఆ తరువాత వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లి పెటాకులైంది.దీంతో తీవ్ర మనస్తాపానికి గురయినటువంటి త్రిష కొంతకాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉండి ఇప్పుడు మళ్లీ బాగానే రాణిస్తోంది.
అయితే తాజాగా త్రిష “పరమపదం విలైయాట్టు” అనే తమిళ చిత్రంలో నటించింది.ఈచిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు తిరుగ్నానం దర్శకత్వం వహించాడు.
అలాగే ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాత టి.శివ నిర్మించారు.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించినటువంటి ఓ ప్రమోషనల్ ఈవెంట్ చిత్ర యూనిట్ సభ్యులు నిర్వహించారు.అయితే ఈ ఈవెంట్ కి త్రిష హాజరు కాలేదు.దీంతో ఈ చిత్ర నిర్మాత టి.శివ త్రిష పై ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతేకాక అందరి ముందు స్టేజీపై ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ చిత్రం అయినప్పటికీ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి త్రిష ఈవెంట్ కి రాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.అంతేగాక ఈ సారికైతే ఓకే కానీ మున్ముందు నిర్వహించేటువంటి ప్రమోషనల్ ఈవెంట్లలో త్రిష కచ్చితంగా పాల్గొనాలని లేకపోతే ఈ చిత్రంలో నటించడానికి తాను తీసుకున్నటువంటి పారితోషికంలో సగం పారితోషకాన్ని వెనక్కి తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అయితే మరి ఈ వ్యాఖ్యలపై త్రిష ఎలా స్పందిస్తుందో చూడాలి.
అయితే ప్రస్తుతం త్రిష టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రంలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడు.అలాగే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పలు కీలక సన్నవేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.