మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ డిస్కో రాజా బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్గా మిగిలింది.ఈ సినిమాతో హిట్ కొట్టాలని ప్రయత్నించిన రవితేజ ఇప్పుడు తన ఫోకస్ను పూర్తిగా తన తాజా చిత్రం ‘క్రాక్’పై పెట్టాడు.
ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా చిత్రంపై అంచనాలను రెట్టింపు చేశాయి.
కాగా ఈ సినిమా టీజర్ను శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.ఓపవర్ఫుల్ కాప్గా రవితేజ ఈ సినిమాలో నటిస్తు్న్నాడు.ఇక ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తుండటంతో ఈ టీజర్ ఎలా ఉంటుందా అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.ఇక శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఈ చిత్ర టీజర్ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ చిత్రంలో హీరోయిన్గా అందాల భామ శృతిహాసన్ నటిస్తోంది.
కాగా థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్కుమార్, సముథిరఖని కీలకపాత్రల్లో నటిస్తున్నారు.దర్శకుడు గోపీచంద్ మలినేనితో రవితేజ గతంలో బలుపు, డాన్ శీను చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.
మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న ఈ చిత్ర టీజర్ ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.