ఈమద్య కాలంలో ఏపీ సీఎం జగన్కు చిరంజీవి సన్నిహితంగా ఉంటున్న విషయం తెల్సిందే.ఒకానొక సమయంలో వైకాపాలో చిరంజీవి జాయిన్ కాబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది.
సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని మొదటగా సమర్ధించింది చిరంజీవి అనే విషయం తెల్సిందే.చిరంజీవి సమర్ధించడంతో పలువురు సినీ వర్గాల వారు కూడా జగన్కు జై కొట్టారు.
ఆ విశ్వాసంతో చిరంజీవికి కీలక పదవి కట్టబెట్టే విషయమై జగన్ ఆలోచించాడు.
రాజకీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవిని ఏపీ నుండి రాజ్యసభకు పంపించాలని భావించారట.
కాని రాజ్యసభ సీటును చిరంజీవి తిరష్కరించినట్లుగా సమాచారం అందుతోంది.గతంలో రాజ్యసభ సభ్యుడిగా చేసి మంత్రిగా కూడా చేసిన చిరంజీవి మళ్లీ రాజ్యసభ సీటు ఆఫర్ వస్తే ఎందుకు వెళ్లలేదు అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అవసరాల కోసం జగన్తో టచ్లో ఉన్నా చిరంజీవి పూర్తిగా తమ్ముడు పవన్కే మద్దతుగా నిలుస్తాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.