ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలలో దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ను దక్కించుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.బాహుబలి తరువాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం యావత్ దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు.
ఇప్పటికే ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులకు ఏకంగా రూ.215 కోట్ల ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.కాగా తాజాగా ఈ రికార్డును దాటేస్తూ డిజిటల్ రైట్స్ రూపంలో సరికొత్త రికార్డు ఇండస్ట్రీ వర్గాలనే షేక్ చేస్తోంది.ఆర్ఆర్ఆర్ చిత్ర డిజిటల్ రైట్స్ను అన్ని భాషల్లో కలిపి ఏకంగా రూ.260 కోట్ల భారీ మొత్తానికి స్టార్ మా ఛానెల్ కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఈ సినిమాలో తారక్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తు్ండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.
పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాన భారీ బడ్జెట్తో డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తు్న్నాడు.ఈ సినిమాను జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.