భారతీయుడు సీక్వెల్ నిర్మాణ దశలో ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో ముగ్గురు అసిస్టెంట్ లు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే ప్రమాదం పై ఆ చిత్ర హీరో కమల్ హాసన్ తన సంతాపాన్ని తెలపడం తో పాటు మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల ఆర్ధిక సాయాన్ని కూడా అందిస్తున్నట్లు తెలిపారు.
భారతీయుడు చిత్రం ఎంతగా విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.అందుకే ఆ చిత్రానికి సీక్వెల్ గా ఇండియన్ 2 అనే పేరుతో కమల్,కాజల్ అగర్వాల్,రకుల్ ప్రీత్ సింగ్ లతో దర్శకుడు శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
అయితే ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చైన్నై శివారు లోని ఒక స్థూడియో లో చోటుచేసుకుంటుంది.
ఈ క్రమంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోగా త్రుటి లో దర్శకుడు శంకర్,హీరో కమల్,హీరోయిన్ కాజల్ అగర్వాల్ లు తప్పించుకున్నారు.లైకా ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, చెన్నై శివార్లలోనే ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా జరుగుతుంది.ఇప్పుడు కూడా అక్కడే షూట్ చేస్తున్న సమయంలో భారీ క్రెయిన్ పడిపోయింది.
అయితే అదే సమయంలో పక్కనే కెమెరా డిపార్ట్మెంట్ దగ్గర దర్శకుడు శంకర్ కూడా ఉండగా ఆయనకు కూడా కాలు కొంచం ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తుంది.చనిపోయిన ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు.
ఇందులో శంకర్ పర్సనల్ అసిస్టెంట్ 28 ఏళ్ల మధు.అసిస్టెంట్ డైరెక్టర్ 34 ఏళ్ల కృష్ణ అలానే ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ (60) కూడా కన్నుమూసినట్లు తెలుస్తుంది.ఇంకా ఈ ప్రమాదంలో 10 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది.
అయితే భారీ క్రేన్ కావడం తో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ చిత్రానికి సంబందించిన మేజర్ షెడ్యూల్స్ అన్నీ చెన్నై, రాజమండ్రి, హైదరాబాద్, రాజస్థాన్ లాంటి ప్రదేశాల్లో చిత్రీకరించాడు దర్శకుడు శంకర్.దాంతో పాటు మరిన్ని కీలకమైన షెడ్యూల్స్ కోసం మార్చి, ఏప్రిల్ లో చైనా, థాయ్లాండ్ లో కూడా చేయాలని ప్లాన్ చేసాడు.
అయితే ఈ లోపే ఈ భారీ ప్రమాదం చోటుచేసుకుంది.