సూపర్ స్టార్ కృష్ణకు విజయ నిర్మల అంటే ఎంత అభిమానం, ప్రేమ ఉంటుందో చెప్పనక్కర్లేదు.ఆమె మృతి చెందే వరకు కూడా ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవారు.
పెళ్లి అయినా కూడా విజయ నిర్మలను పెళ్లి చేసుకున్న కృష్ణ ఇద్దరు భార్యలకు సమాన ప్రాముఖ్యత ఇచ్చారు.అయితే ఎక్కువగా విజయ నిర్మలతో బయట కనిపించే వారు.
విజయ నిర్మలను పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకోక ముందు ఆమె సినిమాల్లో నటించడంతో పాటు ఆమెకు మేకింగ్ విషయాల్లో సలహాలు ఇవ్వడం చేసేవాడు.
చనిపోయిన సమయంలో కృష్ణ కన్నీరు పెట్టుకోవడం అందరిని కదిలించింది.తన జీవిత భాగస్వామి అయిన విజయ నిర్మలను అంత సులభంగా కృష్ణ మర్చి పోలేక పోతున్నాడు.ఇప్పటికి కూడా ఆమె జ్ఞాపకాల్లోనే తాను ఉన్నట్లుగా కృష్ణ చెబుతున్నాడు.
తాజాగా ఆమె జ్ఞాపకార్థం ఆమె ఇంట్లో ఉన్న కాంశ్యవిగ్రహంను ఏర్పాటు చేయించాడు.చనిపోయిన తర్వాత సమాధి కట్టించిన భర్తలను మనం ఇప్పటి వరకు చూశాం.
కాని కృష్ణ గారు ఏకంగా విగ్రహంను పెట్టించారు.
విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంను చాలా వైభవంగా నిర్వహించారు.వేద పండితుల సమక్షంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ల సమక్షంలో మహేష్బాబు, కృష్ణంరాజు, మురళి మోహన్ ఇంకా ఎంతో మంది ప్రముఖుల సమక్షంలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేసి ఆమెపై తనకున్న ప్రేమను మరోసారి నిరూపించుకున్నాడు.