శ్రీరెడ్డిపై వరుసగా పోలీసు కేసులు నమోదు అవుతున్నాయి.ఇటీవలే కరాటే కళ్యాణి తనను శ్రీరెడ్డి వ్యక్తిగతంగా దూషించడంతో పాటు తన పరువు పోయేలా వ్యాఖ్యలు చేసిందని, తన పరువుకు భంగం కలిగించేలా బూతులు తిట్టింది అంటూ ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.
కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం శ్రీరెడ్డిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ సమయంలోనే డాన్స్ మాస్టర్ రాకేష్ కూడా ఆమెపై ఫిర్యాదు చేశాడు.
సోషల్ మీడియాలో వీరిద్దరి మద్య యుద్దం చాలా పెద్దగానే సాగింది.ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు.అయితే మాస్టర్పై రెచ్చి పోయి మరీ బూతుల వర్షం కురిపించిన శ్రీరెడ్డి అడ్డంగా బుక్ అయ్యింది.ఈయన కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మరింతగా ఆమెపై సీరియస్ యాక్షన్కు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
శ్రీరెడ్డి గతంలో కూడా పలువురు స్టార్స్పై విమర్శలు గుప్పించింది, బూతులు తిడుతూ వీడియోలు పోస్ట్లు పెట్టింది.కాని ఎప్పుడు కూడా ఇలాంటి కేసులు నమోదు కాలేదు.కాని ఇప్పుడు తమను బూతులు తిట్టింది అంటూ వారు ఫిర్యాదు చేయడంతో శ్రీరెడ్డి అరెస్ట్ తప్పదంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.ఆమె ఎలా తప్పించుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు