మామూలుగా తమ వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాల నిమిత్తం కొంతమంది మహిళలు సహాయం కోసం బ్యాంకు లోన్ తీసుకోవడానికి బ్యాంకులకి వెళుతుంటారు.అయితే డబ్బు ఎర వేసి లొంగదీసుకొని వారితో సరససల్లాపాలు సాగించే టువంటి ఓ కీచక భర్త ఉదంతాన్ని అతని భార్య బయటపెట్టిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లాలో ఎడ్విన్ జయకుమార్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు.అయితే ఇతడు స్థానికంగా ఉన్నటువంటి ఓ బ్యాంకులో క్యాషియర్ గా పని చేస్తున్నాడు.
అయితే నిత్యం బ్యాంకు లోను విషయమై పలువురు మహిళలు ఇతడిని సంప్రదిస్తుంటారు.దీంతో జయ కుమార్ వారికి బ్యాంక్ లోన్ ఎరగా వేసి తన కోరిక తీరిస్తే మరింత లోన్ ఎక్కువ వచ్చేటట్లు చేస్తానని మభ్యపెట్టి లొంగదీసుకుని ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఫోటోలు వీడియోలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.
అయితే ఈ విషయాన్ని అతడి భార్య గమనించింది.
అంతేగాక అతడి ఫోన్ లో ఉన్నటువంటి వీడియోలు ఫోటోలను కూడా చూసి ఈ విషయంపై జయకుమార్ నిలదీసింది.దీంతో తన భార్య ఈ విషయం బయట పెడితే ఎక్కడ తన గుట్టు రట్టు అవుతుందోనని భయపడినటువంటి జయకుమార్ ఏకంగా ఆమెను హతమార్చేందుకు ప్రయత్నించాడు.అయితే అతడి నుంచి తప్పించుకుని మహిళ వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భర్త చేస్తున్నటువంటి అకృత్యాలపై ఫిర్యాదు చేసింది.
దీంతో ఈ విషయం తెలుసుకున్న టువంటి జయకుమార్ తన తల్లి మరియు మరో మహిళతో కలిసి పరారయ్యాడు.అయితే నిందితుడు భార్య తెలిపిన టువంటి వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.