మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి అల వైకుంఠపురములో లాంటి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ను అందుకున్నాడు.పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.
ఇక ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీని రెడీ చేసే పనిలో పడ్డాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్తో గతంలో ‘అరవింద సమేత’ చిత్రాన్ని తెరకెక్కించిన త్రివిక్రమ్, ఆ సినిమాను బ్లాక్బస్టర్ చేశాడు.
ఇప్పుడు మరోసారి తారక్తో చేతులు కలుపుతున్న త్రివిక్రమ్, ఈసారి కూడా అదిరిపోయే హిట్ను అందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.అల వైకుంఠపురములో స్ట్రాటజీని మరోసారి పూర్తిగా ఈ సినిమా కోసం వాడేందుకు త్రివిక్రమ్ సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమా కూడా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండనుందని తెలుస్తోంది.
‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే టైటిల్తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఆయన రెడీ అవుతున్నాడు.
అల వైకుంఠపురములో చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్లు ఈ సినిమాకు కూడా వాడాలని త్రివిక్రమ్ భావిస్తు్న్నాడు.ఇక ఈ సినిమాను రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేయనున్నారు.
మరి ఈ సినిమాతో త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ సక్సెస్ను కొనసాగిస్తాడో లేదో చూడాలి.