గీతా ఆర్ట్స్ లో కేజీఎఫ్ దర్శకుడుతో సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది అప్పుడే తెలియదు.

 Mahesh Babu And Prashanth Neel Combination Movie On Sets In Geetha Arts-TeluguStop.com

అయితే ఇప్పటికే మహేష్ బాబు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది.

దర్శకుడు ఎవరనే దానిపై ఇన్ని రోజులు కొంత సందిగ్ధత నెలకొంది.అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ కి దర్శకుడు సెట్ అయ్యాడు.

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ దర్శకుడుగా ప్రశాంత్ నీల్ మారిపోయాడు.అయితే ఇతను నెక్స్ట్ సినిమా టాలీవుడ్ హీరోతో ఉండబోతుంది అనేది ఇప్పటి నుంచో వినిపిస్తున్న మాట.వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి.

అయితే ఇప్పుడు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ బాబు హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది అనే మాట ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది.

దర్శకుడు ప్రశాంత్ ఇప్పటికే మహేష్ బాబుకి కథ కథ చెప్పడం జరిగిందని, దాని ఫైనల్ వెర్షన్ కూడా రీసెంట్ గ విని మహేష్ ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.ఇక ఈ ప్రాజెక్ట్ ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించడానికి అల్లు అరవింద్ రెడీ అయ్యాడని సమాచారం.

ఈ సినిమా మహేష్ 28వ మూవీగా ఉండబోతుందని, పాన్ ఇండియా రేంజ్ లో సినిమా ఉంటుందని సమాచారం.కేజీఎఫ్ 2 రిలీజ్ తర్వాత, అటు మహేష్ వంశీ పైడిపల్లి మూవీని పూర్తి చేసి దర్శకుడుతో నెక్స్ట్ ప్రాజెక్ట్ ని రెడీ అవుతాడని ఇండస్ట్రీలో గట్టిగా చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube