ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు అన్ని కూడా వ్యక్తిగతంగా కక్షసాదింపు చర్యలుగా ఉన్నాయి.ప్రధానంగా మూడు పార్టీల మధ్య కనిపిస్తున్న పోరు చూస్తూ ఉంటే ప్రజలలో కూడా అసహనం కలుగుతుంది.
ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం పక్కన పెట్టి మూడు రాజధానుల చుట్టూనే గొడవ తిప్పుతూ వారు చేయాల్సిన పనులు చేసుకుంటున్నారు.ప్రధానంగా ఏపీలో ఒక వర్గం వారికి ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న మీడియా కూడా అసలు ఏపీలో సంక్షేమమే జరగడం లేదు.
విధ్వసం తప్ప అన్నట్లు రాజధాని అంశం చుట్టూనే వార్తలు ప్రసారం చేస్తూ ప్రజలని కూడా తప్పుదోవ పట్టిస్తున్నాయి.
ఓ వైపు జగన్ సైలెంట్ గా పరిపాలన చేసుకుంటూ తాను చేయాలనుకున్న పని చేసుకుంటూ వెళ్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం రాజధాని గొడవని మరింత రాజేస్తున్నారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగత దూషణలు చేస్తూ ప్రజాప్రతినిధులుగా ఉండి సమాజం తలదించుకునే విధంగా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు.మరీ ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దెబ్బ తీయాలనే ప్రయత్నంలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు అదుపు తప్పి మాట్లాడుతున్నారు.
నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడుతూ అసభ్యకర రీతిలో ప్రవర్తిస్తూ కేవలం జగన్ దృష్టిలో పడటానికే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.ఈ వ్యవహారం ముఖ్యమంత్రి జగన్ కి కాస్తా తలనొప్పిగా మారిందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేయమని చెబితే ఇలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ తన ఇమేజ్ దెబ్బతీస్తున్నారని ఎమ్మెల్యేల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.మరి వైసీపీ నేతలు, ఎమ్మెల్యేల తీరు ఇలాగే కొనసాగితే టీడీపీకి పట్టిన గతే పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.