బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో త్వరలో మూడో సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది.ఈ సినిమా కోసం బాలకృష్ణ కంప్లీట్ గా తన లుక్ ని కూడా మార్చుకున్తున్నాడు.
మిర్యాల రవీంద్రబాబు ఈ సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చాడు.ప్రస్తుతం సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ ని ఫైనల్ చేయడంతో పాటు, కాస్టింగ్ సెలక్షన్ లో బోయపాటి బిజీగా ఉన్నాడు.
బాలయ్య-బోయపాటి కాంబో లో వచ్చిన సింహ, లెజెండ్ ని మించి ఈ సినిమా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు.దానికి తగ్గట్లే సినిమా కంటెంట్ కాస్తా సూపర్ నేచురల్ పవర్స్ బేస్ చేసుకొని ఉంటుందని తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో సినిమాలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కోసం ఏకంగా 70 కోట్లు వరకు ఖర్చు అవుతుందని నిర్మాతకి బోయపాటి చెప్పాడు.అయితే బాలకృష్ణ కేవలం కేవలం కొన్ని సన్నివేశాలకే 70 కోట్లు అంటే సినిమా మొత్తం కలిపితే వంద కోట్లకి పైగానే బడ్జెట్ అవుతుంది.
అంత బడ్జెట్ బాలకృష్ణ మీద పెట్టడమంటే ప్రస్తుతం రిస్క్ తో కూడుకున్న పనే.ఎంత చూసిన బాలయ్య బాబు మార్కెట్ స్టామినా అంత లేదు.ఈ నేపధ్యంలో వంద కోట్ల బడ్జెట్ బాలకృష్ణ పెట్టడం తన వల్ల కాదని నిర్మాత మిర్యాల రవీంద్రబాబు చేతులెత్తేసినట్లు తెలుస్తుంది.భారీ బడ్జెట్ పెట్టేందుకు ప్రస్తుతం ఉన్న నిర్మాత ముందుకి రాకపోవడంతో ఇప్పుడు బాలకృష్ణ సినిమా కోసం ఓ పెద్ద నిర్మాతని వెతికే పనిలో పడ్డాడు.
ర్మాత సెట్ అయిన తర్వాత బోయపాటి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి.మరి బాలకృష్ణ మీద వంద కోట్ల బడ్జెట్ అంటే కచ్చితంగా పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేయాలి.
అయితే బాలయ్యకి తెలుగులోనే పెద్దగా మార్కెట్ లేదు.మరి పాన్ ఇండియా మూవీ అంటే ఏ నిర్మాత ముందుకొస్తాడు అనేది చూడాలి.