ఎప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ, విభిన్న కథనాలు నేర్చుకుంటూ ప్రేక్షకులను తనదైన శైలిలో అలరించే టువంటి డైలాగ్ కింగ్ మోహన్ బాబు రెండవ తనయుడు మంచు మనోజ్ గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ప్రస్తుతం మంచు మనోజ్ “అహం బ్రహ్మాస్మి” అనే చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే ఈ చిత్ర కథాంశం నచ్చడంతో మంచు మనోజ్ సొంతంగా తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ఓ వార్త హల్చల్ చేస్తోంది.ఈ వార్తల్లో ముఖ్యంగా మంచు మనోజ్ ఈ చిత్రంలో అఘోరా పాత్రలో నటిస్తున్నట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అంతేగాక ఈ చిత్రం ఓ మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో ఈ చిత్రం తెలుగు, హిందీ మలయాళం, తమిళ్, కన్నడ తదితర భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
దీంతో మంచు మనోజ్ కూడా బడ్జెట్ విషయంలో అసలు వెనకాడడం లేదని సమాచారం.
అయితే ఈ మధ్య కాలంలో మంచు మనోజ్ తన జోరును తగ్గించాడు.గతంలో నటించినటువంటి గుంటూరోడు, అటాక్, శౌర్య వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్దదారుణంగా డిజాస్టర్ గా నిలిచాయి.దీంతో కథల విషయంలో మంచు మనోజ్ ఆచితూచి అడుగేస్తున్నాడు.
అందువల్లనే దాదాపుగా మూడేళ్ల కాలం పాటు సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది.