హైదరాబాద్ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి నుంచి ప్రాణ హాని ఉందంటూ ఒక మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించింది.మంత్రిగారి వల్ల ప్రాణహాని ఉందని మానవ హక్కుల కమీషన్ లో ఫిర్యాదు చేసినట్లుట్ తెలుస్తుంది.
సూరారం లోని మంత్రి గారికి చెందిన రెండు ఆసుపత్రుల మధ్యలో ఆ మహిళ కు ఒక ఎకరం 33 గుంటల భూమి ఉందని,దానిని కబ్జా చేసేందుకు మంత్రి యత్నిస్తున్నారు దీనిపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం తో ఇలా మానవహక్కుల కమీషన్ ను ఆశ్రయించినట్లు తెలుస్తుంది.పోలీసులను ఆశ్రయించినప్పటికీ కూడా న్యాయం మాత్రం జరగలేదు అని చివరికి మానవహక్కుల హక్కుల కమీషన్ ను ఆశ్రయించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
ఆ పొలం కబ్జా చేయాలనీ చూస్తున్నారని,తరచూ తన అనుచరులతో బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు అంటూ ఫిర్యాదు చేసింది.అంతేకాకుండా మంత్రి నుంచి వారి అనుచరుల నుంచి తనకు రక్షణ కల్పించాలి అంటూ కమీషన్ ను బాధిత మహిళ వేడుకున్నట్లు తెలుస్తుంది