ఐ-ప్యాక్ డైరెక్టర్ వివాహానికి హాజరు కానున్న ఏపీ సీఎం

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం లక్నో లో ఒక వివాహవేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తుంది.ఇంతకీ ఆ వివాహం ఎవరిదంటే పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐ-ప్యాక్) డైరెక్టర్ రుషి ది.

 Rishi Marriage In Luknow Ipac Jagan-TeluguStop.com

ఆయన వివాహ వేడుక లక్నో లో జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ ఈ వేడుకలో పాల్గొనడానికి వెళుతున్నట్లు సమాచారం.ఈ ఐ-ప్యాక్ వ్యూహ రచనలతోనే గతేడాది ఏపీ లో జగన్ కు చెందిన వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

గతఏడాది జరిగిన ఎన్నికల కు వైసీపీ పార్టీ ఘన విజయం సాధించడానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ-ప్యాక్ సంస్థ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఐ ప్యాక్ తో ఏ పార్టీ అయితే సంబంధాలు పెట్టుకుంటే దాదాపు ఆ పార్టీ 99 శాతం అధికారంలోకి వచ్చినట్లే అన్న సక్సెస్ రేటు ను సాధించింది.

ఈ నేపథ్యంలో గతంలో బీజేపీ,జేడీయూ,మొన్న వైసీపీ,ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా ప్రతి ఒక్కరూ కూడా అధికారంలోకి రావడానికి ఈ ఐ ప్యాక్ సంస్థ వెనక ఉండి నడిపించింది.

Telugu Cm Jagan, Pac Rishi-Movie

దీనితో ప్రశాంత్ కిషోర్ కు రాజకీయ వ్యూహకర్త గా మరింత డిమాండ్ పెరిగిపోయింది.ఈ క్రమంలోనే ఐ ప్యాక్ తో సంబంధాలను మరింత కొనసాగించాలనే ఉద్దేశ్యం తోనే సీఎం జగన్ ఇలా ఆ సంస్థ డైరెక్టర్ వివాహానికి హాజరవుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube