తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాన్ని హరితహారం గా తీర్చిదిద్దేందుకు టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ మొదలు పెట్టినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న స్పందన లభిస్తోంది.ఇందులో భాగంగా పలువురు సినీ ప్రముఖులు ఈ ఉద్యమంలో పాల్గొంటూ మరియు తమకు ఇష్టమైన వాళ్లను కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములను చేస్తున్నారు.
అయితే తాజాగా మాస్ మరియు యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో మంచి దిట్ట అయినటువంటి దర్శకుడు వి.వి వినాయక్ ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమంలో పాల్గొన్నారు.ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి తన కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు.అంతేగాక ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ ని ప్రముఖ టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి విసిరారు.
అలాగే రాష్ట్రంలోని బాధ్యతగల పౌరులందరూ మొక్కలు నాటాలని దీనివల్ల వాతావరణ కాలుష్యం తగ్గి మంచి ఆక్సిజన్ ని పొందుతామని అన్నారు.
అయితే ఇటీవల కాలంలో వివి వినాయక్ దర్శకత్వం వహించినటువంటి ఇంటిలిజెంట్ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.అంతేగాక ఈ చిత్రం ఎఫెక్ట్ తన సినీ కెరియర్ పై కూడా పడినట్లు తెలుస్తోంది.దీంతో కొంతమేర వివి వినాయక్ తన జోరుని తగ్గించాడు.అయితే వి.వి.వినాయక్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నాడు.