తమిళ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తోంది.లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తనదైన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటోంది.
కాగా ఈ బ్యూటీ తమిళంలో నటించిన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘వసంతకాలం’ పేరుతో తెలుగులో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు నిర్మాత దామెర విఎన్ఎస్ శ్రీనివాస్ అందిస్తున్నాడు.5 కలర్స్ మల్టీ మీడియా బ్యానర్పై ఈ సినిమాను రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు రెడీ అయ్యారు.సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ ముఖ్య పాత్రల్లో నటించారు.
నయనతార యాక్టింగ్ ఈ సినిమాకు మేజర్ హైలైట్ కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
చక్రి తోలేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ మరో హైలైట్ కానుందట.
ఈ సినిమాను ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వదులుతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.నయనతార ఫ్యాన్స్ ఈ సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.