స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది.ఈ సినిమాతో బన్నీ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ను అందుకున్నాడు.
ఇక ఈ సినిమా తరువాత బన్నీ తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ను ఇప్పటికే ముగించుకున్న చిత్ర యూనిట్ రెండో షెడ్యూల్కు రెడీ అవుతోంది.
అయితే ఈ రెండో షెడ్యూల్ షూటింగ్కు బన్నీ మరింత సమయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఫిబ్రవరిలో రెండో షెడ్యూల్లో జాయిన్ అవ్వాల్సిన బన్నీ, మార్చిలో జాయిన్ అవతానని చెప్పాడట.
తన కుటుంబంతో మరింత సమయాన్ని కేటాయించాలని బన్నీ నిర్ణయం తీసుకున్నాడట.
ఇక పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాడట.
ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్తో ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్గా కన్నడ బ్యూటీ రష్మిక మందన నటించనుంది.