ఎంతో సంబరంగా చేసుకున్న పెళ్లి మండపంలో అనుకోని విషాద ఘటన చోటుచేసుకుంది.సంబరంగా పెళ్లి జరిగిన కొద్దిసేపటికే వరుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోవడం ఆ మండపం లో తీవ్ర విషాదాన్ని కలిగించింది.
ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది.నిజామాబాద్ జిల్లా లోని బోధన్ పట్టణానికి చెందిన మంగలి గణేష్(25) కు శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరిగింది.
అయితే రాత్రి ఊరేగింపు జరుగుతుండగా పెద్ద ఎత్తున బారాత్ ను ఏర్పాటు చేశారు.అయితే ఆ డీజే సౌండ్ కు అస్వస్థత కు గురైన గణేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం తో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
అయితే గణేశ్ మాత్రం గుండెపోటుతోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తుంది.
అయితే పెళ్లి అయిన కొద్దీ గంటల్లోనే వరుడు మృతి చెందడం తో ఇరు కుటుంబాలలో విషాదం నెలకొంది.వధువు కాళ్ల పారాణి ఆరక ముందే వరుడు మృతి చెందడం తో నవ వధువు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.