మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్.సాయి ధరమ్ తేజ్ తమ్ముడైన విష్ణవ్ ఉప్పెన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్న సంగతి తెలిసిందే.
సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడు చిట్టిబాబు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
ఇక సినిమా కథ వైజాగ్ నేపధ్యంలో మత్స్యకార ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి హీరో వైష్ణవ్ ఫస్ట్ లుక్ ని వేలెంటైన్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.
కొద్ది రోజుల క్రితం ఇందులో విలన్ గా నటిస్తున్న తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి పాత్రని పరిచయం చేశారు.
ఈ పాత్రలని పరిచయం చేసిన తర్వాత ఉప్పెన సినిమా గురించి టాలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.
రంగస్థలంలో జగపతిబాబు పాత్రకి దగ్గరగా ఇందులో విలన్ గా నటిస్తున్న విజయ్ సేతిపతి పాత్ర ఉంది.అలాగే రంగస్థలంలో రామ్ చరణ్ పాత్ర తరహాలోనే వైష్ణవ్ తేజ్ లుక్ ఉంది.
అలాగే సినిమా నేపధ్యం కూడా ఇంచుమించు అదే నేపధ్యంగా కనిపిస్తుంది.ఇక ఈ సినిమాకి కథ అందించింది సుకుమార్ అనే విషయం అందరికి తెలిసిందే.
ఈ పోలికల ఆధారంగానే ఉప్పెన సినిమాని రంగస్థలంతో పోలుస్తున్నారు.సుకుమార్ ముందుగా రామ్ చరణ్ కోసం ఈ కథ సిద్ధం చేసుకొని అతనికి చెప్పి ఉంటాడని, అయితే లవ్ స్టొరీ కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండే కథ కావాలని చెప్పడంతో కాస్తా క్యారెక్తరైజేషన్ మార్చి రంగస్థలం సినిమా చేసి ఉంటాడని భావిస్తున్నారు.
ఈ ఉప్పెన సినిమా రంగస్థలం సినిమాకి ఫస్ట్ వెర్షన్ అని భావిస్తున్నారు.ఈ కథ కూడా బాగుండటంతో రామ్ చరణ్, వైష్ణవ్ ఎంట్రి మూవీగా ప్లాన్ చేసినట్లు చర్చించుకుంటున్నారు.